News January 8, 2026
నిజామాబాద్: బయ్యర్ – సెల్లర్ మీటింగ్లో పసుపు బోర్డు ఛైర్మన్

మైసూర్లో జరిగిన బయ్యర్-సెల్లర్ మీటింగ్లో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆశలు, ఆశయాలకు కొత్త దిశ చూపిన హృదయస్పర్శి సమావేశంగా నిలిచిందన్నారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు, భవిష్యత్ మార్కెట్ అవకాశాలపై ఆశతో పెద్ద ఎత్తున హాజరైన రైతులు ఈ సమావేశానికి ప్రాణం పోశారని కొనియాడారు.
Similar News
News February 5, 2026
NZB: విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

జక్రాన్పల్లి మండలంలో విద్యుత్ షాక్కు గురై వంశీకృష్ణ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. SI మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మండలం గోవింద్పేట్కు చెందిన వంశీకృష్ణ బైక్ పై మాక్లూర్లోని ముత్యంపల్లెలో గల తన భార్య వద్దకు వెళుతున్నాడు. మార్గమధ్యలో రాత్రి దారి తప్పిపోయి సికింద్రాపూర్ రంగనాయక గుట్ట వద్ద తిరుగుతుండగా జొన్న తోటకు అడవి పందుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ తీగల తగిలి మృతి చెందాడు.
News February 4, 2026
NZB: ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలను మరోమారు క్షేత్రస్థాయిలో సరి చూసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.
News February 4, 2026
NZB: అందుకే కాంగ్రెస్లోకి రాలేదు: MP

హిందూ వ్యతిరేకులు కనుకనే తాను కాంగ్రెస్లోకి రాలేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోనియాగాంధీ తమ కుటుంబానికి ఎంతో దగ్గర అయినప్పటికీ తాను ఆ పార్టీ హిందూ వ్యతిరేకం కనుకనే కాంగ్రెస్లో చేరలేదన్నారు. తన తండ్రిని అవమానపరిచి కాంగ్రెస్ నుంచి బయటకు పంపారన్నారు. తన కార్లపై, ఇంటిపై దాడులు చేశారని మండి పడ్డారు.


