News February 24, 2025
నిజామాబాద్: రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత KCRకు లేదు: TPCC చీఫ్

విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఫామ్ హౌస్లో పడుకునే KCRకు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తాను పరిగెత్తుతూ మంత్రులను పరిగెత్తిస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ధైర్యం ముఖ్యమని, ఆ ధైర్యం రేవంత్ రెడ్డికి గుండె నిండా ఉందని పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
పోక్సో కేసులు 34% వరకు తగ్గుముఖం: సిద్దిపేట సీపీ

2025 పోలీస్ శాఖ వార్షిక నివేదికలో పోక్సో కేసుల్లో 34% తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్స్ కేసులు 589 నుంచి 572కు తగ్గాయన్నారు. 731 ప్రాపర్టీ ఆఫన్స్ కేసుల్లో ఇప్పటి వరకు రూ.1,42,69,301 వర్త్ ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు. 2024తో పోలిస్తే 2025లో మర్డర్ కేసులు 12% తగ్గాయన్నారు. 2024తో పోలిస్తే 2025లో 4% ఎక్కువ సాధారణ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు.
News December 30, 2025
2025లో శాంతి భద్రతలు ప్రశాంతం: సిద్దిపేట సీపీ

2025లో జిల్లా అంతటా శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని వార్షిక నివేదికలో సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు చేసిన ఫిర్యాదులను ఎటువంటి సంకోచం లేకుండా, నేరాలను నిర్లక్ష్యం చేయకుండా FIRలు స్వేచ్ఛగా నమోదు చేశామన్నారు. కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 507 కేసులు నమోదు చేశామన్నారు.
News December 30, 2025
టుడే టాప్ స్టోరీస్

*అసెంబ్లీలో కేసీఆర్ను పలకరించిన CM రేవంత్
*ఏపీలో 28 జిల్లాలు ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం.. జనవరి 1నుంచి అమలులోకి
*రాయచోటి ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్షమాపణలు
*మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి ఎక్స్ప్రెస్ వే
*ఉన్నావ్ రేప్ కేసు.. సెంగార్ను విడుదల చేయొద్దన్న సుప్రీంకోర్టు
*FIDE వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాలు గెలిచిన హంపి, అర్జున్ ఎరిగైసి


