News July 19, 2024
నిజామాబాద్: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

హత్య కేసులో ఓ వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి సునీత తీర్పు వెల్లడించారు. వివరాలిలా.. ఆలూరు(M)కు చెందిన గంగుకు తన కోడలితో గొడవలు జరిగేవి. ఈ విషయాన్ని వెంకటి అనే వ్యక్తికి చెప్పడంతో అతడు నగలు దోచుకోవాలనే దురుద్దేశ పడ్డాడు. గొడవ పడకుండా ఉండేందుకు పూజలు చేయాలని చెప్పాడు. 2022 SEP 27న ఓ మడుగులో స్నానం చేయాలని చెప్పాడు. ఆమె నీటిలో దిగగానే మెడకు చీర చుట్టి చంపేశాడు.
Similar News
News August 26, 2025
NZB: CP ఎదుట 28 మంది బైండోవర్

గణేశ్ విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉల్-నబి, దుర్గామాత ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట 28 మందిని బైండోవర్ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన DJ ఆపరేటర్లు, DJ యజమానులు, ట్రబుల్ మాంగర్స్ను బైండోవర్ చేశారు. వచ్చే 6 నెలల పాటు సత్ప్రవర్తనను కొనసాగించాలని సీపీ ఆదేశించారు.
News August 26, 2025
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన గణేశ్ చతుర్థి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు.
News August 26, 2025
NZB: కొండెక్కిన పూల ధరలు

వినాయక చవితి పండగకు ముందే నిజామాబాద్లో పూల ధరలు కొండెక్కాయి. గులాబీలు, వివిధ రకాల చామంతుల ధరలు సోమవారం హోల్సెల్ మార్కెట్లో కిలో రూ.400 పలికాయి. బంతిపూలు రూ.200 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. పూలదండల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మరి పండుగ రోజు ధరలు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.