News December 21, 2024
నిజాయతీగా పనిచేయండి: అబ్దుల్ అజీజ్

వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్లు నిజాయితీగా పనిచేయాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ సూచించారు. 26 జిల్లాల ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్స్తో ఆయన నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… వక్ఫ్ ఆస్తులతో సంపద సృష్టించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
Similar News
News December 30, 2025
సందిగ్ధంలో గూడూరు సబ్ కలెక్టర్ పోస్టు..?

గూడూరు సబ్ కలెక్టర్ పోస్టుకు మోక్షం కలగడం లేదు. ఇక్కడ సబ్ కలెక్టర్గా పనిచేసిన రాఘవేంద్ర మీనన్ బదిలీ అయి 2 నెలలు గడుస్తోన్నప్పట్నుంచి ఇంచార్జిగా శ్రీకాళహస్తి RDO భానుప్రకాష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన రెండు చోట్ల విధులు నిర్వహించాల్సి రావడంతో ప్రజల సమస్యలు పరిష్కారం కావడంలో ఆలస్యం నెలకొంది. గూడూరు నెల్లూరులో కలిపిన తరువాత అయినా.. పోస్టును భర్తీ చేయాల్సి ఉంది.
News December 30, 2025
నెల్లూరు: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్లోకి విలీనం చేశారు.
News December 30, 2025
నెల్లూరు: వారి మధ్య విభేదాలు లేనట్టేనా ?

కావలిలో బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి మధ్య వైరం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. బీదకు TDP అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత MLA దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కావ్య బీద రవిచంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారి మధ్య వైర ఉందా.. లేదా..? అనేదానికి చెక్ పెడతారా..?అనేది చూడాల్సి ఉంది.


