News September 1, 2025

నిడదవోలు: వందే భారత్ రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

image

నిడదవోలు నుంచి సోమవారం వందే భారత్ రైలు ఢీ కొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు కంటి ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. నిడదవోలులో రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆమె వయసు 65 ఏళ్లు ఉంటుందని, వివరాలు సేకరిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Similar News

News September 3, 2025

జిల్లాలో అవసరానికి తగిన యూరియా సరఫరా: కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరా సమయానుకూలంగా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లాకు అవసరమైన 26,000 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు 22,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు వివరించారు. దుకాణదారులు యూరియా, ఎరువులను అధిక ధరకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 3, 2025

వార్డు సచివాలయాల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి: కలెక్టర్

image

వార్డు సచివాలయాల పనితీరును నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నోడల్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో చెత్త సేకరణతో పాటు రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటిపై వచ్చే సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఐవీఆర్ఎస్ కాల్స్‌లో వచ్చే ఫిర్యాదులపై స్పందించాలని పేర్కొన్నారు.

News September 2, 2025

కృష్ణునిపాలెంలో కోడి కత్తులతో దాడి.. నలుగురి అరెస్టు

image

గోకవరం మండలం కృష్ణునిపాలెంలోని పెట్రోల్ బంకు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా మంగళవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. ఈ ఘర్షణలో గోకవరానికి చెందిన గేదెల శివ, రాయి అచ్చారావు, కామేష్, మహిపాల దుర్గాప్రసాద్ ఓసీ బంధ గ్రామానికి చెందిన జ్యోతి, భరత్‌పై కోడి కత్తులతో దాడిచేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుల కోసం గాలించి నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.