News March 5, 2025
నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడమర్రు(M) గుణపర్రులో జరిగింది. గ్రామంలో రొయ్యలు చెరువు సాగు చేస్తున్న నిమ్మల శ్రీను సుమారు రూ.కోటి మేర నష్టపోయాడు. అప్పులు తీర్చలేనని మనోవేదనకు గురై విషం తాగాడు. ఆ తర్వాత సోదరుడికి ఫోన్ చేయడంతో బంధువులు గాలించి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 6, 2025
ప.గో జిల్లా TODAY TOP HEADLINES…

✷ TPG: జగన్పై ఎమ్మెల్యే బొలిశెట్టి ఫైర్ ✷ భీమవరం: 6న గీత కులాల మద్యం షాపుల డ్రా ✷మాజీ ఎమ్మెల్యే పాడె మోసిన తణుకు ఎమ్మెల్యే ✷ ప.గో: నిధులు వినియోగంలో ఏపీఐఐసీ తీవ్ర జాప్యం✷ నరసాపురంలో 8 కేజీల వెండి చోరీ ✷అత్తిలి: స్నేహితుల మధ్య ఘర్షణ..వ్యక్తి హత్య✷ నిడమర్రు: ఆక్వా రైతు ఆత్మహత్య✷ ఏలూరు: రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ అనుబంధం ✷ కాళ్ల: ఎమ్మెల్సీ పేరాబత్తులను అభినందించిన RRR
News March 5, 2025
తాడేపల్లిగూడెం: అతఃపాతాళంలో ఇది ఆరంభం మాత్రమే

పవన్ కళ్యాణ్ని ఏదోకటి విమర్శిస్తేనే కానీ జగన్ని ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పట్టించుకొనే పరిస్థితి లేదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బుుధవారం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పవన్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ పవన్ విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రజలు ఇవ్వని ‘ప్రతిపక్ష హోదా’ని అడుక్కోవడం ఏంటని ప్రశ్నించారు.
News March 5, 2025
ఏలూరు: రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ అనుబంధం

సాధారణంగా రాజకీయాల్లో కానీ ఆటల్లో కానీ పోటీల్లో కానీ వ్యాపారంలో కానీ ఇలా ఏ రంగంలో అయినా ప్రత్యర్థులు అంటే ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉంటారు. అయితే ఎమ్మెల్సీగా పోటీ చేసిన పేరాబత్తుల రాజశేఖర్ దిడ్ల వీర రాఘవులు వీరిద్దరూ పోటీపడ్డారు. అంతేకాక కౌంటింగ్లో కూడా వీరిద్దరి మధ్యనే పోటీ నెలకొంది. అయితే రాజశేఖర్ గెలిచాక స్నేహపూర్వక వాతావరణంలో కౌంటింగ్ సెంటరులో ఇరువురూ ఆత్మీయంగా నవ్వుతూ పలకరించుకున్నారు.