News November 13, 2025
నిడమర్రు: రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

నవంబర్ 8-10 వరకు విజయవాడలో జరిగిన అంతర్ రాష్ట్ర అండర్-17 హ్యాండ్ బాల్ పోటీలకు నిడమర్రులోని చానమిల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని బత్తిన ధరణి ప్రియ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 11,12 తేదీల్లో జరిగిన సివిల్ సర్వీసెస్ వాలీబాల్, బాస్కెట్ బాల్ టీంకి జిల్లా నుంచి వ్యాయామ ఉపాధ్యాయురాలు వలపుల సౌజన్య రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఇరువురిని MEO-2 శేషగిరి రావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Similar News
News November 13, 2025
మిథున్ రెడ్డికి జనసేన కౌంటర్

మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో బుకాయిస్తే ఆయన తండ్రి <<18276752>>ఆక్రమణలు <<>>సక్రమం కావని జనసేన పేర్కొంది. ‘1968 సెప్టెంబర్ 16న మంగళంపేట ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 76ఎకరాలున్న భూమి 103ఎకరాల 98సెంట్లు ఎలా అయ్యిందో చెబుతారా మిథున్ రెడ్డి. అడవిని ఎలా కబ్జా చేశారో మీ తండ్రిని అడగండి. 32ఎకరాల 63సెంట్లు అడవిని కబ్జా చేసేసినంత ఈజీ కాదు చట్టం నుంచి తప్పించుకోవడం. కాసేపట్లో మీ కబ్జా చిట్టా బయటికి వస్తుంది’ అని ట్వీట్ చేసింది
News November 13, 2025
ఉంగుటూరు: ‘రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతివ్వాలి’

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం కలెక్టర్ కె.వెట్రి సెల్విని, అటవీ శాఖ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దశబ్దాలుగా కొల్లేరులో వ్యవసాయం చేసుకొని జీవనోపాధి సాగిస్తున్న రైతులను కొల్లేరులో వ్యవసాయం చెయ్యటానికి వీలు లేదన్నారు. గత కొన్ని రోజులుగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవటంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
News November 13, 2025
GNT: దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు నెలల్లో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం విడుదల చేశారు. ఎంఏ సంస్కృతం, ఎంఏ పొలిటికల్ సైన్స్ మొదటి, ద్వితీయ, తృతీయ, నాలుగవ సెమిస్టర్, ఎమ్మెస్సీ జువాలజీ, బోటనీ, మైక్రో బయాలజీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్కు ఈ నెల 29లోగా అందజేయాలన్నారు.


