News August 4, 2024
నిత్యావసర సరకుల పంపిణీని సజావుగా చేపట్టాలి: కలెక్టర్

ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీని సజావుగా చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని ఓల్డ్ టౌన్లో ఉన్న 9వ వార్డులో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరకుల పంపిణీని చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News February 28, 2026
పింఛన్ పంపిణీలో కలెక్టర్ ఆనంద్

అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లిలో ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కలెక్టర్ స్వయంగా నగదు అందజేశారు. గ్రామస్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.
News February 28, 2026
అనంత: వైద్యశాఖపై జిల్లా కలెక్టర్ సమీక్ష

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
News February 28, 2026
అనంత: వైద్యశాఖపై జిల్లా కలెక్టర్ సమీక్ష

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.


