News March 22, 2025

నిధులు ఇవ్వమని సీఎంను కోరుతా: VZM కలెక్టర్

image

జిల్లాకు ప్ర‌ధాన‌మైన తోట‌ప‌ల్లి కుడి ప్ర‌ధాన కాల్వ‌, తార‌క‌రామ తీర్థ‌సాగ‌రం ప్రాజెక్టుల‌ను పూర్తిచేసేందుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను మంజూరు చేయాల‌ని త్వ‌ర‌లో జ‌రిగే క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎంను కోర‌నున్న‌ట్టు క‌లెక్ట‌ర్ అంబేడ్క‌ర్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష జరిపారు.ఆయా ప్రాజెక్టుల ప‌నులు, భూసేక‌ర‌ణ‌, పున‌రావాసం పూర్తిచేసేందుకు ఏమేర‌కు నిధులు అవ‌స‌ర‌మ‌వుతాయో నివేదిక ఇవ్వాలని కోరారు.

Similar News

News March 22, 2025

VZM: జిల్లాలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తి

image

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి శనివారం జిల్లా పర్యటనకు నగరానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా SP వకుల్ జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికల్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.

News March 22, 2025

VZM: జాగ్రత్త.. తేదీలను చింపేసి మరీ అమ్మకాలు!

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్స్, ఏజెన్సీలపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో నివ్వెర పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మత్తును కలిగించే ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారు. వాటిపై ముద్రించిన తయారీ, ఎక్స్‌పైరీ తేదీలను చించి మరీ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

News March 22, 2025

జిల్లాలో రక్తహీనత తగ్గింది: కేంద్ర బృందం

image

ర‌క్త‌హీన‌త‌ను నివారించేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప‌లు ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థంగా అమ‌లు చేస్తున్న కార‌ణంగానే జిల్లాలో ర‌క్త‌హీన‌త త‌గ్గింద‌ని జిల్లాలో ప‌ర్య‌టించిన కేంద్ర ప్ర‌భుత్వ వైద్య‌ నిపుణుల‌ బృందం అభిప్రాయ‌ప‌డింది. కలెక్టర్ అంబేడ్క‌ర్‌ను కేంద్ర బృంద ప్రతినిధులు శుక్రవారం కలిశారు. జిల్లాలో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన త‌ర్వాత గుర్తించిన అంశాల‌ను క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.

error: Content is protected !!