News September 24, 2025

నిన్న దుర్గమ్మ ఆదాయం రూ.31.08 లక్షలు

image

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంకు మంగళవారం రూ. 31,08,645 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. రూ.300, రూ.100 టికెట్ల ద్వారా, లడ్డూ ప్రసాదాలు, ప్రత్యేక కుంకుమార్చన, కేశఖండనశాల, అమ్మవారి ఫోటో, క్యాలెండర్ విక్రయాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. నిన్న అమ్మవారు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.

Similar News

News September 24, 2025

ASF: గోల్డ్ మెడల్స్ సాధించిన కార్మికురాళ్లు

image

ఇద్దరు సింగరేణి మహిళా కార్మకులు గోల్డ్ మెడల్స్ సాధించారు. భూపాలపల్లిలో జరిగిన సింగరేణి కంపెనీ స్థాయి వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలలో గోలేటి CHP ఉద్యోగురాలు అనురాధ పవర్ లిఫ్టింగ్ 57 kg విభాగంలో, మమత 47 కిలోల విభాగంలో మెడల్స్ సాధించారు. ఈ విజయంతో కోల్ ఇండియా ఛాంపియన్ షిప్‌లో పాల్గొనే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

News September 24, 2025

ASF: పాఠశాలలో పనులు వెంటనే పూర్తి చేయాలి

image

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్, ఇన్‌ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి దీపక్ తివారి సూచించారు. బుధవారం ASF కలెక్టరేట్‌లో విద్యాశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి గదుల నిర్మాణం తదితరల అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.

News September 24, 2025

ప్యాకేజ్ ఇస్తే చాలన్నట్లు పవన్ తీరు: రోజా

image

AP: తన మూవీ టికెట్ రేట్లు పెంచితే చాలు ప్రజలేమైనా పర్లేదన్నట్లు Dy.CM పవన్ తీరుందని మాజీమంత్రి రోజా విమర్శించారు. ‘రైతు మద్దతు ధరలేక అల్లాడుతుంటే పవన్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ప్యాకేజ్ ఇస్తే చాలు, సినిమా రేట్లు పెంచితే చాలన్నట్లు ఉన్నారు. ఒకసారి గెలిపించండి తలరాతలు మారుస్తానని అడుక్కొని గెలిచారు. ఏ ఒక్క వర్గానికైనా ఉపయోగపడ్డారా? షూటింగ్స్ చేసుకోక మీకెందుకు రాజకీయాలు’ అని ఎద్దేవా చేశారు.