News February 17, 2025
నిపుణులతో విద్యార్థులకు కంటి పరీక్షలు: DMHO

నిపుణులతో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ తెలిపారు. BHPL జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు 8 రోజులపాటు కొనసాగనున్నట్లు తెలిపారు. ఆర్.బి.ఎస్.కె, టీం ద్వారా ఫేస్ 1, ఫేస్ 2లో 5 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు కళ్లు స్క్రీనింగ్ చేసి కంటి సమస్యలు గుర్తించనున్నట్లు తెలిపారు.
Similar News
News February 21, 2026
పీఎం సూర్యఘర్ అమలులో పురోగతి సాధించాలి: కలెక్టర్

PM సూర్యఘర్, PM కుసుం పథకాల అమలులో జిల్లా యంత్రాంగం వేగంగా పురోగతి సాధించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి CS విజయానంద్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, హాస్టళ్లలో సౌకర్యాలు, పారిశుద్ధ్యం గంజాయి నియంత్రణపై సమీక్షించారు. విద్యుత్ పొదుపుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు.
News February 21, 2026
పీఎం సూర్యఘర్ అమలులో పురోగతి సాధించాలి: కలెక్టర్

PM సూర్యఘర్, PM కుసుం పథకాల అమలులో జిల్లా యంత్రాంగం వేగంగా పురోగతి సాధించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి CS విజయానంద్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, హాస్టళ్లలో సౌకర్యాలు, పారిశుద్ధ్యం గంజాయి నియంత్రణపై సమీక్షించారు. విద్యుత్ పొదుపుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు.
News February 21, 2026
సూపర్-8 సమరం ఇవాళ్టి నుంచే!

T20 WCలో లీగ్ దశ ముగిసింది. ఇవాళ్టి నుంచి సూపర్-8 సమరం మొదలుకానుంది. మొత్తం 8 టీమ్స్లో టాప్-4 సెమీ ఫైనల్స్కు చేరుకుంటాయి. నేటి రాత్రి 7 గంటలకు కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇంగ్లండ్, శ్రీలంక, రాత్రి 7 గంటలకు ఇండియా, సౌతాఫ్రికా మ్యాచులు జరగనున్నాయి.


