News August 18, 2025
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: నిర్మల్ ఎస్పీ

నిర్మల్ జిల్లాలో డీజే, లౌడ్స్పీకర్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శబ్ద కాలుష్యం వల్ల ప్రజలకు అసౌకర్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద పరికరాల వినియోగం పూర్తిగా నిషిద్ధమని ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News August 18, 2025
ప్రకాశం జిల్లాలో మరో 4లైన్ రహదారి.!

ప్రకాశం జిల్లా వాసుల కోసం రహదారి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట నుంచి కత్తిపూడి వరకు గల 250 కిలోమీటర్ల రహదారిని 4 లైన్లుగా విభజించేందుకు నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించింది. నేషనల్ హైవే 216గా గుర్తించి ఈ రహదారిని 4 లైన్ల రహదారిగా మార్చనున్నారు. ఈ దారి ఒంగోలు నుంచి బాపట్ల, బాపట్ల నుంచి పెడన, పెడన నుంచి లక్ష్మీపురం, కత్తిపూడి వరకు వెళ్తుంది.
News August 18, 2025
యూరియా వినియోగంపై నిఘా ఉంచాలి: కలెక్టర్

యూరియా వినియోగంపై అధికారులు నిఘా ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశించారు. జిల్లాకు ఈ ఏడాది ఖరీఫ్లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, మొత్తం 29,527 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యత ఉందన్నారు. 26,008 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించగా, ఇంకా 3,519 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.
News August 18, 2025
VZM: ప్రజల నుంచి 27 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 27 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. భూ తగాదాలకు సంబంధించి 7, కుటుంబ కలహాలకు సంబంధించి 5, మోసాలకు పాల్పడినట్లు 4, ఇతర అంశాలకు సంబంధించి 11 ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.