News March 20, 2025
నిబంధనలు పాటించని లారీలు సీజ్: కలెక్టర్

నిబంధనలు పాటించని రాయిలోడుతో వెళ్లే వాహనాలను సీజ్ చేస్తామని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లో అధికారులు, క్వారీ లారీల యజమానులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల క్వారీ లారీల కారణంగా ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వీటి వల్ల రైల్వే ట్రాక్ దెబ్బతిన్నలతో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిందన్నారు.
Similar News
News March 20, 2025
నా రాజీనామాను ఆమోదించండి: ఎమ్మెల్సీ పద్మశ్రీ విజ్ఞప్తి

శాసనమండలి సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ శాసనమండలి ఛైర్మన్ను కోరారు. గతేడాది ఆగస్టు 30న తన రాజీనామా లేఖను శాసనమండలి స్పీకర్కు అందించిన ఇంతవరకు ఆమోదించలేదని నా రాజీనామా ఆమోదించి నన్ను పదవి నుంచి తప్పించండి అంటూ మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు బుధవారం జరిగిన మండలి సమావేశంలో ఆమె విజ్ఞప్తి చేశారు.
News March 20, 2025
అనకాపల్లి: దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.
News March 20, 2025
2 రోజులు సెలవులు, 2 రోజులు ఆప్షనల్ హాలిడేస్

TG: హజ్రత్ అలి షహాదత్ను గుర్తు చేసుకుంటూ ఈ నెల 21న ఆప్షనల్ హాలిడే ఇచ్చిన ప్రభుత్వం అందులో మార్పు చేసింది. రంజాన్ నెల చంద్రవంక కనిపించడం ఆలస్యం కావడంతో మార్చి 22న ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. ఈ నెల 28న కూడా జుమతుల్ విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది. దీంతో స్కూళ్లు, కాలేజీలు ముఖ్యంగా మైనారిటీ సంస్థలు సెలవు ఇవ్వొచ్చు. ఇక తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31, ఏప్రిల్ 1న రంజాన్ సెలవులు ఉన్నాయి.