News September 6, 2025
నిబద్ధతతో పనిచేస్తేనే మనుగడ: సిరిసిల్ల కలెక్టర్

నిబద్ధతో పనిచేస్తేనే వ్యవస్థ మనగడ సాధ్యమవుతుందని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో గ్రామ పాలన అధికారులకు శనివారం నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ప్రభుత్వంలో చాలా కీలకమన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీలకు గ్రామ పాలన అధికారులను ప్రభుత్వం నియమించిందని జీపీఓలు క్షేత్రస్థాయిలో ప్రజలను నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించాలన్నారు.
Similar News
News September 6, 2025
బాపట్ల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

బైక్, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన బాపట్ల మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కొండుబోట్లపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురు యువకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరొక వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 6, 2025
నల్గొండ: ‘శ్రద్ధగా విధులు నిర్వర్తించాలి’

గ్రామ పాలనాధికారులు తమ పనిపై పూర్తి శ్రద్ధ వహించి విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన గ్రామ పాలనాధికారుల కౌన్సెలింగ్లో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎలాంటి సిఫారసులకు, పక్షపాతానికి ఇందులో తావు లేదని అన్నారు. సోమవారం నాటికి వంద శాతం మంది విధుల్లో చేరాలని ఆమె ఆదేశించారు.
News September 6, 2025
హైదరాబాద్లో వినాయక నిమజ్జనం అప్డేట్స్

* ఇప్పటివరకు 2,54,685 వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి
* హుస్సేన్ సాగర్ వద్ద అట్టహాసంగా సాగుతున్న ప్రక్రియ. గంగమ్మ ఒడికి చేరిన 10వేల విగ్రహాలు
* మరో 4,500 పెద్ద విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉందన్న సీపీ సీవీ ఆనంద్
* నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్లో రేపు తెల్లవారుజాము 4.40 గంటల వరకు నడవనున్న MMTS రైళ్లు