News September 11, 2025
నిమ్స్కు క్యూ కడుతున్న రోగులు

నగరంలో ప్రతిష్ఠాత్మక నిమ్స్ ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. చికిత్స కోసం వేల మంది ఓపీకి వస్తుండటంతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. 3 రోజుల్లోనే దాదాపు 11,590 మంది వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం 4,055 మంది, మంగళవారం 3,600 మంది వచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో రోగులురావడం నిమ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.
Similar News
News September 11, 2025
HYD: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోల్ ఫ్రీ నంబర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం HYDలోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం టోల్ ఫ్రీ కాల్ సెంటర్ను, హెల్ప్ డెస్క్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఫోన్ నం.1800 599 5991ను ఆవిష్కరించారు. ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉ. 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందన్నారు.
News September 11, 2025
SEP 17న సాయుధ పోరాట దినోత్సవం: MLA

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవంగా జరపాలని HYDలో జరిగిన ఓ సమావేశంలో డిమాండ్ చేశారు. 1947 SEP 11న పోరాటం ప్రారంభమైందని, ఆ పోరాట యోధుల విగ్రహాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
News September 11, 2025
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్గా ప్రొ.డా.వాణి

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్గా అడిషనల్ DME ప్రొ.డా.వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతవరకు సూపరింటెండెంట్గా ఉన్న డా.రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్గా వ్యవహరిస్తారని అధికారులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి పాలనా వ్యవహారాల్లో రోగులు, సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణలు, విమర్శలతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.