News February 1, 2025
నిర్మల్లో తప్పిపోయి మెట్పెల్లిలో కనిపించాడు
నిర్మల్లో వ్యక్తి తప్పిపోయి మెట్పెల్లిలో కనిపించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ADBజిల్లా బోథ్కు చెందిన అబ్దుల్ మాజీద్ (40) గురువారం నిర్మల్లో ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. ప్రార్థనల కోసమని బంధువుల ఇంటి నుంచి వెళ్లిన ఆయన కనిపించంలేదు. కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉన్నట్లు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News February 1, 2025
నేడే కేంద్ర బడ్జెట్
ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది.
News February 1, 2025
MNCL: ‘మీవి ఖాళీ భూములా.. సోలార్ ప్లాంట్ వేసుకోండి’
బంజరు, వ్యవసాయానికి అనుకూలంగా లేని భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ మంచిర్యాల సర్కిల్ ఎస్ఈ గంగాధర్ కోరారు. సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ను టీజీఆర్ఈసీ నిర్ణయించిన టారిఫ్ ప్రకారం టీజీఎన్పీడీసీఎల్ కొనుగోలు చేస్తుందన్నారు. వివరాలకు 6304903933, 9000550974 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
News February 1, 2025
ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా?
ఉద్యోగులకు ఏసీ ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం అలవాటైపోయింది. కానీ ఇది తీవ్రమైన వ్యాధులకు దారి తీయొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలపాటు ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు పెరగడం, మధుమేహం వస్తుంది. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మెడ, వెన్ను నొప్పి వస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, డిప్రెషన్, అల్జీమర్స్, రక్తపోటు, పక్షవాతం వ్యాధి వచ్చే అవకాశం ఉంది.