News April 7, 2025

నిర్మల్: అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

image

మండల ప్రత్యేక అధికారులంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. నూతన పథకాలు అమలు, ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయాలలో ఆఫ్ లైన్ విధానంలోనూ దరఖాస్తులను స్వీకరించాలని, దరఖాస్తుదారులకు రసీదును ఇవ్వాలన్నారు.

Similar News

News November 2, 2025

NLR: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు

image

నెల్లూరు జిల్లాలోని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు రెండు రోజులుగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. BNS168 సెక్షన్ ప్రకారం సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. గ్రూప్ పేరు, మొబైల్ నంబర్స్, గ్రూప్ సభ్యుల సంఖ్య, గ్రూప్ దేని కోసం వాడుతున్నారు? అనే వివరాలను పోలీసు స్టేషన్లో అందజేయాలంటున్నారు. గ్రూపులో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ బాధ్యత అడ్మిన్లదేనని నోటిసుల్లో స్పష్టం చేస్తున్నారు.

News November 2, 2025

అన్నమయ్య: ‘నాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి’

image

కోడూరు వ్యాపారి మోహన్ రాజు వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక కారుణ్య మరణం కోరుతూ దుకాణం ముందు బోర్డు పెట్టారు. కరోనాలో వ్యాపారం నష్టపోయి, అప్పులు చెల్లించలేక ఐపీ పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. కొంతమందికి బకాయిలు చెల్లించినా, బాండ్లు, చెక్కులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News November 2, 2025

ఫైనల్లో గెలిచి భారత ఫ్యాన్స్‌ను సైలెంట్ చేస్తాం: దక్షిణాఫ్రికా కెప్టెన్

image

WWC ఫైనల్లో హర్మన్ సేనను ఓడించి భారత ఫ్యాన్స్‌ను సైలెంట్ చేస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అన్నారు. ఇరు జట్లపై తీవ్ర ఒత్తిడి ఉందని, గత రికార్డులను పరిగణనలోకి తీసుకోకుండా మ్యాచ్‌ను ఫ్రెష్‌గా ప్రారంభిస్తామన్నారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే వారే ఫైనల్లో ముందంజ వేస్తారని పేర్కొన్నారు. ఇవాళ మ.3.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2023 WC ఫైనల్ ముందు కమిన్స్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.