News April 23, 2025
నిర్మల్: ఇంటర్ ఫలితాల్లో మారిన జిల్లాస్థానం

ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా ఉత్తీర్ణత స్థానంలో మార్పు సాధించింది. గతేడాది ఫస్టియర్లో నిర్మల్ జిల్లా 56% ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలువగా ఈసారి 70.87%తో 17వ స్థానానికి చేరింది. సెకండియర్లో గతేడాది 66% ఉత్తీర్ణతతో 12వ స్థానంలో ఉండగా.. ఈసారి 58.78% ఉత్తీర్ణతతో పదో స్థానం కైవసం చేసుకుంది.
Similar News
News April 23, 2025
టెర్రరిస్టుల దాడిని ఖండించిన నారాయణపేట ఎమ్మెల్యే

జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి తెలిపారు. మరికల్ మండలం అప్పంపల్లిలో ఆమె మాట్లాడారు. తీవ్రవాదులు సామాన్య జనాలపై దాడులు నిర్వహించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వీరన్న, సూర్య మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి ఉన్నారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
News April 23, 2025
11వ స్థానానికి ఎగబాకిన పల్నాడు జిల్లా

పల్నాడు జిల్లా పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి 25,382 మంది విద్యార్థులలో 21,358 మంది ఉత్తీర్ణత సాధించారు. 84.15 శాతం పాస్ పర్సంటైల్ నమోదు అయింది. గతేడాది 86.05 శాతంతో 18వ స్థానంలో ఉన్న జిల్లా, ఈసారి 11వ స్థానానికి ఎగబాకడం గమనార్హం. విద్యార్థులు, అధ్యాపకుల కృషికి ఫలితంగా ఈ పురోగతి సాధ్యమైందని అధికారులు అభిప్రాయపడ్డారు.