News February 12, 2026
నిర్మల్: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

కుబీర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ఆత్మహత్య చేసుకుంది. భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2026
మంచిర్యాల: రేపటి కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొరకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు అభ్యర్థులు ఎన్నికల సిబ్బందికి సహకరించాలని సూచించారు.
News February 12, 2026
త్వరలో మొబైల్ అంగన్వాడీలు.. ఇంటికే సరుకులు

TG: అర్హులందరికీ అంగన్వాడీ సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఇందుకోసం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. HYD, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ వాహనాలను వినియోగించాలని నిర్ణయించారు. HMDA పరిధిలోని 274 బస్తీల్లో 25,310 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వీటి ద్వారా టేక్ హోం రేషన్ విధానంలో ఇళ్ల వద్దకే సరుకులు అందిస్తారు.
News February 12, 2026
ఇంటర్ పరీక్షల్లో అడిషనల్ ఆన్సర్ షీట్లు ఉండవు: బోర్డు

AP: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు-2026లో విద్యార్థులకు అడిషనల్ ఆన్సర్ షీట్లను ఇవ్వబోమని బోర్డు ప్రకటించింది. ఫస్టియర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనమిక్స్, సివిక్స్, కామర్స్, హిస్టరీ సబ్జెక్టులకు 32 పేజీల ఆన్సర్ బుక్లెట్ను అందిస్తామంది. మిగతా ఫస్టియర్, బ్యాక్లాగ్ సబ్జెక్టులకు, సెకండియర్లోని అన్ని పేపర్లకు 24 పేజీల బుక్లెట్ ఇస్తామని తెలిపింది. పరీక్షలు ఉదయం 9-12 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొంది.


