News July 24, 2024
నిర్మల్: ఈనెల 25న ఎక్సైజ్ స్టేషన్లో వాహనాల వేలం

నిర్మల్ జిల్లా ఎక్సైజ్ స్టేషన్లో గురువారం వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం ఉంటుందని ఎక్సైజ్ అధికారి ఎండి రజాక్ తెలిపారు. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు ద్విచక్ర వాహనాలు 18, మహేంద్ర బొలెరో 1, కార్లు 3, ప్యాసింజర్ ఆటోలు 3, ఒక ట్రాలీ ఆటో మొత్తం 26 వాహనాలకు బహిరంగ వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 12, 2026
ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.
News February 11, 2026
బోథ్ అడవుల్లో పులుల సంచారం

బోథ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి, చిరుత సంచారం కలకలం రేపుతోంది. పుణ్య నాయక్ తండాలో పవర్ సక్రుకు చెందిన ఆవుపై పులి దాడి చేసి చంపింది. అటవీ అధికారులు ప్రశాంత్ పాటిల్, విశ్వనాధ్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, విద్యుత్ కంచెలు వేయవద్దని హెచ్చరించారు. అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News February 10, 2026
ADB: ఈ నెల 20 వరకు పత్తి కొనుగోళ్లు

సీసీఐ కేంద్రాలలో కొనుగోలు చేస్తున్న పత్తి ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి తెలిపారు. రైతులు పత్తి అమ్మెందుకు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకొవాలని సూచించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులకు వీలులేదన్నారు. పత్తి నిల్వ ఉన్న రైతులు తప్పకుండా త్వరగా సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని వివరించారు.


