News September 4, 2025
నిర్మల్: ఈనెల 6న వైన్స్ బంద్

గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈనెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు.
Similar News
News September 7, 2025
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి MIM మద్దతు

వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఐఎం ప్రెసిడెంట్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ తనను కోరినట్లు అసద్ Xలో పోస్ట్ చేశారు. ‘హైదరాబాదీ, న్యాయనిపుణుడైన సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం. ఆయనతో మాట్లాడి బెస్ట్ విషెస్ చెప్పాను’ అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈనెల 9న జరగనుంది.
News September 7, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> రేపు పాలకుర్తి సోమేశ్వర ఆలయం మూసివేత
> జనగామ: యూరియా కోసం రైతుల ఇక్కట్లు
> జనగామలో బంజారాల రౌండ్ టేబుల్ సమావేశం
> జనగామ: మా సార్ను పంపించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం: విద్యార్థులు
> జవహర్ నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం
> పాలకుర్తి: రాష్ట్ర స్థాయి పోటీలకు ఉపాధ్యాయుడు ఎంపిక
> జనగామ నుంచి లండన్కు గణపతి లడ్డూ
> కోర్టుకు హాజరైన జనగామ ఉద్యమకారులు
News September 7, 2025
భూపాలపల్లి: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసై పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్ఐ అశోక్ కథనం మేరకు.. మొగుళ్లపల్లి మండలం పెద్దకొమిటీ గ్రామానికి చెందిన బండి గోపి(42) ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసై ఈనెల 5న మద్యం మత్తులో తన కౌలు చేను వద్ద పురుగు మందు తాగాడు. ఈ మేరకు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.