News March 6, 2025

నిర్మల్: ఉర్దూ ఉత్తమ ఉపాధ్యాయ దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ఉర్దూ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రామారావు సూచించారు. దరఖాస్తులను ఈ నెల 7న సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. జిల్లాలోని ఉర్దూ మాధ్యమ ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులను రెండు రకాల డిక్లరేషన్లతో కలిపి కార్యాలయంలో అందించాలన్నారు.

Similar News

News March 6, 2025

తొలి 5 సెంచరీలు ఐసీసీ టోర్నీల్లోనే.. రచిన్ రికార్డ్

image

న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర వన్డేల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తన తొలి 5 సెంచరీలనూ ఐసీసీ టోర్నీల్లోనే చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 2023 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 123*, ఆసీస్‌పై 116, పాక్‌పై 108, CT-2025లో బంగ్లాపై 112, నిన్న సౌతాఫ్రికాపై 108 రన్స్ బాదారు. కాగా ఇప్పటివరకు 32 వన్డేలు ఆడిన రచిన్ 44.29 యావరేజ్, 108.72 స్ట్రైక్ రేటుతో 1,196 పరుగులు చేశారు.

News March 6, 2025

పాల్వంచ: లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు

image

పాల్వంచ టౌన్ శ్రీ నిలయం అపార్ట్మెంట్‌లో సునీల్ అనే వ్యక్తి తన సెల్ ఫోన్లో మహిళల ఫొటోలు తీస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వాచ్మెన్ & లాండ్రీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నంద్యాల వెంకటేశ్వర్లు అన్నారు. అపార్ట్మెంట్లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి గురువారం ఫిర్యాదు చేశారు. ఓ వాచ్మెన్ భార్యతో కూడా ఇలాగే వ్యవహరించాడని వారు తెలిపారు.

News March 6, 2025

ఘోర ప్రమాదాలు.. 10 మంది మృతి

image

AP వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి జరిగిన 4 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. HYD నుంచి కాకినాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఏలూరు(మ) సోమవరప్పాడులో లారీని ఢీకొని ముగ్గురు చనిపోయారు. చిత్తూరు ఇరువారం జంక్షన్ వద్ద బైకును కారు ఢీకొట్టడంతో ఇద్దరు, విశాఖ కంచరపాలెంలో చెట్టును బైక్ ఢీకొట్టి ఇద్దరు, నిన్న రాత్రి గువ్వలచెరువు ఘాట్‌లో కారును తప్పించబోయి లారీ లోయలో పడి ముగ్గురు మృతి చెందారు.

error: Content is protected !!