News October 5, 2025
నిర్మల్: ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి రద్దు

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ప్రజావాణి నిలిపివేస్తున్నామని, కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్
సూచించారు.
Similar News
News April 5, 2026
నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. న్యాయశాఖ మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఏఎస్పీ మందా జావళి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 118వ జయంతి పురస్కరించుకుని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
News April 5, 2026
జగ్జీవన్ రామ్ విగ్రహానికి కర్నూలు కలెక్టర్ నివాళి

డా.బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని కలెక్టర్ సిరి అన్నారు. ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆర్ఎస్ రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం జగ్జీవన్ రామ్ నిరంతరం కృషి చేశారని ఆమె అన్నారు.
News April 5, 2026
కానిస్టేబుల్పై టీడీపీ నేతల దాడి: వైసీపీ

CTR: అక్రమ గ్రావెల్ దందాను ప్రశ్నించినందుకు కార్వేటినగరం(M) అల్లాగుంటకు చెందిన AR కానిస్టేబుల్ యుగంధర్పై TDP నేతలు దాడికి తెగబడ్డారని YCP ఆరోపించింది. ‘బైక్పై వెళ్తున్న యుగంధర్పై TDP నాయకులు ఆదాము, ప్రవీణ్, భాగ్యరాజ్ దాడి చేశారు. తీవ్ర గాయాలతో కానిస్టేబుల్ కోమాలోకి వెళ్లిపోయారు. ఏంటి ఈ దారుణం చంద్రబాబు, అనిత. పోలీసులపై ఇలా దాడి చేశారంటే.. ఇక సామాన్యుల్ని బతకనిస్తారా?’ అని YCP ట్వీట్ చేసింది.


