News January 15, 2026
నిర్మల్: ఓటర్ల లెక్క కొలిక్కి.. ఇక మొదలెడదామా

నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 1,67,015 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈనెల 17 లేదా 18న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతలు గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.
Similar News
News January 23, 2026
V2V కోసం 30 GHz కేటాయించిన కేంద్రం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల ప్రకటించిన <<18808386>>V2V టెక్నాలజీ<<>> కోసం 30 GHz రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా వాహనాలు ఇంటర్నెట్ అవసరం లేకుండా నేరుగా భద్రతా సమాచారాన్ని పంచుకుంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చే ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ కోసం ఒక్కో వాహనానికి రూ.5,000-7,000 ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
News January 23, 2026
ఇషాన్ కిషన్ ఊచకోత.. రికార్డ్ బ్రేక్

రెండో టీ20లో భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తున్నారు. ఈక్రమంలోనే 21 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదారు. దీంతో NZపై అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్గా నిలిచారు. తొలి టీ20లో అభిషేక్ 22 బాల్స్లో ఈ ఫీట్ సాధించగా ఇషాన్ దాన్ని బద్దలుకొట్టారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో ఫిఫ్టీ చేశారు.
News January 23, 2026
విజయవాడ: LRS గడువు మరోసారి పొడిగింపు!

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. ఎల్ఆర్ఎస్-2025 కింద రూ.10,000 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ తెలిపారు. ఇప్పటికే దాదాపు 62 వేల దరఖాస్తులు అందాయని చెప్పారు. మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.


