News March 2, 2026
నిర్మల్: క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలు

రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్స్లో (2026-27) 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 1-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన వారు అర్హులు. విద్యార్థులు మార్చి 4లోపు tgss.telangana.gov.inలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో మోటార్ క్వాలిటీ (శారీరక సామర్థ్య) టెస్టులు నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు.
Similar News
News March 2, 2026
ఉత్తమ ఫలితాలకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలి: కలెక్టర్

ములుగు జిల్లాలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల కోసం సమగ్ర కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా విశ్లేషణ చేసి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. రోజువారీ, వారాంత పరీక్షలతో సన్నద్ధం చేయాలని, తల్లిదండ్రులతో సమన్వయం పెంచాలని తెలిపారు. విద్యార్థులకు విజయపథ సందేశ లేఖలు అందజేశారు. అధికారులు పాల్గొన్నారు.
News March 2, 2026
రైల్వేలో 22,195 జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు గడువును మార్చి 3 నుంచి మార్చి 9వ తేదీకి పొడిగించారు. అప్లికేషన్ ఫీజు చెల్లింపు గడువు మార్చి 11తో ముగియనుంది. పోస్టును బట్టి టెన్త్, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై, 18-36 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్ ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: <
News March 2, 2026
ఖమేనీకి ఎంత మంది పిల్లలో తెలుసా?

ఇజ్రాయెల్-US దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఒక భార్య, ఆరుగురు పిల్లలున్నారు. ఆయన భార్య పేరు మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్. వీరికి 1964లో వివాహమైంది. నలుగురు కుమారులు (మోస్తఫా, మొజ్తాబా, మసౌద్, మేసమ్), ఇద్దరు కూతుళ్లు (బోష్రా, హోదా), ఏడుగురు గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఓ కూతురు, కోడలు, మనుమరాలు, అల్లుడు కూడా మరణించినట్లు వార్తలొచ్చాయి.


