News April 9, 2025

నిర్మల్: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

image

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.

Similar News

News April 17, 2025

వైవీయూకు రూ.10 కోట్లు

image

కడప: అకడమిక్, రీసెర్చ్ ఎక్సలెన్స్ దిశగా దూసుకుపోతున్న వైవీయూకు మెగా రీసెర్చ్ ప్రాజెక్ట్ మంజూరైంది. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ పార్టనర్‌షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ పథకం కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి రూ.10 కోట్లు నిధులు మంజూరయ్యాయి. అత్యున్నత స్థాయి పరిశోధనా సంస్థలతో కలసి వైవీయూ రీసెర్చ్ చేస్తుందని వీసీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు.

News April 17, 2025

రేపు హాల్ టికెట్లు విడుదల

image

AP: పలు ఉద్యోగ పరీక్షల హాల్‌టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC ప్రకటించింది. అభ్యర్థులు https://psc.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 28న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ జాబ్స్‌కు 28, 29న పరీక్షలు జరుగుతాయి. ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 28న పేపర్-1, 30న పేపర్-2, పేపర్-3 ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

News April 17, 2025

మద్దూర్: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన హైలెట్స్

image

✓ధరణికి, భూభారతికి పోలికే లేదన్నారు.✓ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ లక్షలాది ఎకరాలు కొల్లగొట్టిందని ఆరోపించారు. ✓అధికారులే ప్రజల దగ్గరకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. ✓జూన్ 2న నాలుగు పైలెట్ మండలాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు.✓భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతులకు భద్రత కల్పిస్తాం.✓ధరణి చట్టం ద్వారా రైతులు ఎదుర్కొన్న సమస్యలు భూభారతి చట్టం ద్వారా తీరుతుంది.

error: Content is protected !!