News October 7, 2025
నిర్మల్: చెరువులో దూకి ఇద్దరు అన్నదమ్ముల మృతి

ఇద్దరు అన్నదమ్ములు చెరువులో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ బంగల్పేట్ చెరువులో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన నరేష్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తమ్ముడు నవీన్ కాపాడడానికి వెళ్లాడు. దీంతో ఇద్దరు చెరువులో మునిగిపోయి చనిపోయారు. జాలర్లు మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 7, 2025
కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి విటమిన్ D

గర్భస్థ శిశువు ఆరోగ్యానికి విటమిన్ D ఎంతో అవసరమంటున్నారు పరిశోధకులు. ఫీటల్ స్కెలిటన్ గ్రోత్, ప్లాసెంటా, తల్లి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు D విటమిన్ తగినంత ఉండాలని చెబుతున్నారు పెన్స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. లేదంటే నెలలు నిండకుండా పుట్టడం, ఫీటల్ లెంత్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>
News October 7, 2025
కన్నడ ‘బిగ్బాస్’కు షాక్.. నిలిచిపోయిన షో

కన్నడ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్బాస్ షో నిలిచిపోయింది. కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(KSPCB) నోటీసులతో మేకర్స్ షూటింగ్ నిలిపేశారు. షూటింగ్ జరుగుతున్న జాలీవుడ్ స్టూడియోస్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని యాక్టివిస్టులు ఆందోళన చేయడంతో KSPCB చర్యలు తీసుకుంది. స్టూడియో నుంచి వస్తున్న కలుషిత నీటితో స్థానిక ఎకోసిస్టం దెబ్బతింటోందని పేర్కొంది.
News October 7, 2025
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న యుగంధర్ని పదోన్నతిపై కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా వెంకట్రావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో యుగంధర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.