News March 31, 2025

నిర్మల్‌ జిల్లాలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలోని మామడ మండలం తాండ్ర గ్రామంలో సోమవారం 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధకారులు వెల్లడించారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోత్రత నమోదైందన్నారు. కాగా రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News September 15, 2025

కిమ్ ఆగడాలు.. మూవీస్ షేర్ చేస్తే చంపేశారు!

image

నార్త్ కొరియాపై యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన 14 పేజీల రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశం విడిచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. ‘2015లో తీసుకొచ్చిన చట్టాలు, పాలసీలతో పౌరులపై సర్వేలైన్స్, అన్ని విధాలుగా వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగింది. ఆఖరికి ఫారిన్ మూవీస్, K-డ్రామాలు షేర్ చేసుకున్నారని ఎంతో మందిని చంపేశారు’ అని నివేదికలో ఉంది.

News September 15, 2025

మైథాలజీ క్విజ్ – 6

image

1. వ్యాస భాగవతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరేంటి?
3. కంసుడు పరిపాలించిన రాజ్యం?
4. మొధెరా సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రావణ మాసం పౌర్ణమి నాడు వచ్చే పండగ ఏది? (సరైన సమాధానాలను కామెంట్ చేయండి. జవాబులను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
<<17696624>>మైథాలజీ క్విజ్ – 5<<>> ఆన్సర్స్: 1.భూమి, ఆకాశం 2.త్రయంబకేశ్వర ఆలయం 3.మాఘ మాసం 4.భీష్ముడు 5.సీత

News September 15, 2025

యూరియాను పక్కదారి పట్టించిన గన్‌మెన్ నల్గొండకి అటాచ్..!

image

MLG ఎమ్మెల్యే BLR గన్‌మెన్ నాగునాయక్‌ యూరియాను పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. ఈఘటనపై సీరియస్ అయిన ఎస్పీ నాగు నాయక్‌ను నల్గొండ జిల్లా కేంద్రానికి అటాచ్ చేశారు. విచారణ పూర్తయ్యాక శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.