News March 31, 2025

నిర్మల్‌ జిల్లాలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలోని మామడ మండలం తాండ్ర గ్రామంలో సోమవారం 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధకారులు వెల్లడించారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోత్రత నమోదైందన్నారు. కాగా రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News December 29, 2025

కామారెడ్డి: జిల్లాలో చలి తీవ్రం.. అప్రమత్తత అవసరం

image

కామారెడ్డి జిల్లాలో చలి ప్రభావం మళ్లీ ఎక్కువైంది. రానున్న మూడు రోజుల్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఆరంజ్ అలెర్ట్ లోనే కొనసాగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది. పిల్లలు, వృద్ధులు వెచ్చటి వస్త్రాలతో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 29, 2025

SVU : డిగ్రీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో B. Sc/ B.Com/ B.A/ B.B.A/ B. Voc/ B.H.M/ B.M.U.S డిగ్రీ (UG) రెగ్యులర్ రెండవ (2వ) సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు. అభ్యర్థుల ఈ విషయాన్ని గమనించగలరు.

News December 29, 2025

‘ఆరావళి’పై రేపు సుప్రీంలో విచారణ

image

<<18663286>>ఆరావళి పర్వతాల<<>> నిర్వచనంపై చెలరేగిన వివాదాన్ని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. ఆరావళి కొండలు, శ్రేణుల నిర్వచనం, అనుబంధ సమస్యల వివాదంపై ముఖ్యంగా విచారణ జరగనుంది. కాగా ఆరావళిలో మైనింగ్‌ <<18662201>>నిలిపివేస్తున్నట్లు<<>> కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.