News August 19, 2025
నిర్మల్ జిల్లాలో 428.2 మి.మీ వర్షపాతం

నిర్మల్ జిల్లాలో గడిచిన 24గంటల్లో 428.2మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుబీర్14.2, తానూర్13.8, బాసర8.4, ముధోల్ 15.2, భైంసా 18.4, కుంటాల 30.8, నర్సాపూర్ 18.2, లోకేశ్వరం 18.4, దిలావర్పూర్ 25.4, సారంగాపూర్ 37.2, నిర్మల్ 32.6, నిర్మల్ రూరల్ 26.4, సోన్ 24.4, లక్ష్మణచందా 17.2, మమడ 25.2, పెంబి 27.6, ఖానాపూర్ 22.2, కడెం 21.2, దస్తురాబాద్ 31.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.
Similar News
News August 19, 2025
రైతులకు ఆందోళన అవసరం లేదు: జనగామ డీఏఓ

యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) అంబికా సోని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతుల అవసరాలకు అనుగుణంగా పంపిణీ జరుగుతోందని తెలిపారు. అవసరానికి మించి ఎరువును నిల్వచేసుకోవద్దని సూచిస్తూ, ప్రతి రైతుకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని DAO వివరించారు.
News August 19, 2025
విశాఖ-అరకు వస్తున్న ఎక్సప్రెస్కు స్త్రీ శక్తి పథకం అమలు కావట్లేదు

విశాఖ నుంచి అరకు మీదుగా ఒనకఢిల్లీ వెళ్ళే ఎక్సప్రెస్ కు “అంతరాష్ట్ర సర్వీసు” పేరుతో స్త్రీ శక్తి పథకం అమలు చేయలేదు. విశాఖ నుంచి అరకు వస్తున్న ఒకే ఒక్క ఎక్సప్రెస్ కావడంతో అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ మండలాల మహిళలకు స్త్రీ శక్తి పథకం అందని ద్రాక్షగా ఉంది. ఈ బస్సు ప్రయాణించు 200కి.మీలలో 130కి.మీ ఆంధ్రలోనే ఉంది. దీనిపై DPTO మహేశ్వరరెడ్డిని వివరణ కోరగా పైస్థాయిలో అంతరాష్ట్ర సర్వీసలపై చర్చ జరుగుతుందన్నారు
News August 19, 2025
‘ఈనెల 24న చొప్పదండికి మీనాక్షి మేడమ్’

ఈనెల 24న చొప్పదండి నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర ముఖ్యనేతలు యాత్రలో పాల్గొననున్నారని చెప్పాయి. 25వ తేదీ ఉదయం 7 గంటల వరకు శ్రమదానం, పార్టీ నేతల సమావేశం ఉంటుందన్నాయి.