News March 5, 2025

నిర్మల్: జిల్లా నేతలకు దిశా నిర్దేశం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్దామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన అంతర్గత పార్టీ సమావేశంలో జిల్లా నాయకులకు ఆమె దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితరులున్నారు.

Similar News

News February 28, 2026

ఖమేనీ టార్గెట్‌గా దాడులు!

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయడమే లక్ష్యంగా <<19260918>>అమెరికా-ఇజ్రాయెల్<<>> దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిస్సైల్స్ టెహ్రాన్‌లోని ఖమేనీ ఆఫీసులకు, ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆయన అప్పటికే సేఫ్ హౌస్‌కు వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. న్యూక్లియర్ డీల్‌కు ఖమేనీనే అడ్డంకి అని పలుమార్లు ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

News February 28, 2026

ఇంటర్ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DVEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్థులు 2682 మందికి 67 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2575 మందికి 124 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5257 మంది విద్యార్థులకు 5066 మంది హాజరు కాగా 191 మంది గైర్హాజర్ అయినట్లు తెలిపారు.

News February 28, 2026

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు: DPRO

image

నిర్మల్ జిల్లాలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించినట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (DPRO) తెలిపారు. కార్డులు కలిగిన జర్నలిస్టులు మధ్యాహ్నం 3 గంటల నుంచి తమ ఒరిజినల్ కార్డులతో కార్యాలయానికి రావాలని సూచించారు. అక్కడ గడువు పెంపునకు సంబంధించిన స్టిక్కర్లు వేయించుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.