News July 15, 2024
నిర్మల్: నాఖాబందిలో 664 కేసులు నమోదు

నిర్మల్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన నాకాబంది(ప్రత్యేక తనిఖీ)లో మొత్తం 664 కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటిలో హెల్మెట్ లేనివారు 565, డ్రైవింగ్ లైసెన్స్ 7, సీట్ బెల్ట్ 5, రాంగ్ డ్రైవింగ్ 9, ట్రిపుల్ డ్రైవింగ్ 7, నంబర్ ప్లేట్ 66, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ 2, మైనర్ డ్రైవింగ్ 2 కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News February 19, 2026
ADB: స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి పథకం ద్వారా స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా SC సంక్షేమ శాఖ అధికారిణి సునీత కుమారి పేర్కొన్నారు. ఈ – పాస్ ఆన్ లైన్లో మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 18, 2026
రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆదిలాబాద్ చిన్నారుల ప్రభంజనం

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఆటల పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకోవడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ పోటీల కోసం జిల్లా నుంచి 26 మంది విద్యార్థులు హైదరాబాద్కు వెళ్లగా, వారు పాల్గొన్న దాదాపు అన్ని విభాగాల్లోనూ సత్తా చాటారు. వారిని కలెక్టర్ అభినందించారు.
News February 18, 2026
ADB: బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

ఐటీఐ 2 సంవత్సరాల కోర్సులో పాసైన విద్యార్థుల నుంచి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలోకి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 21లోపు సర్టిఫికెట్లతో కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 60% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. బ్రిడ్జి కోర్సు ప్రవేశ పరీక్ష మార్చి 12న ఉంటుందన్నారు.


