News April 8, 2025
నిర్మల్: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ బస్ కండక్టర్

నిర్మల్ డిపోకు చెందిన బస్ కండక్టర్ ఆర్.గంగాధర్ నిజాయితీని చాటుకున్నారు. పర్సు మరిచిపోయిన ప్రయాణీకుడి వివరాలు తెలుసుకోని అప్పగించాడు. నిర్మల్ నుంచి భైంసాకు వెళ్తున్న బస్సులో శివకుమార్ అనే వ్యక్తి పర్సును మరిచిపోయి దిగిపోయాడు. కండక్టర్ శివకుమార్ సీటులో ఉన్న పర్సును గమనించి ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణీకుడిని పిలిపించి పర్సును అందజేశాడు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ ను డిపో మేనేజర్ అభినందించారు.
Similar News
News April 8, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి 57 ఫిర్యాదులు

HYDలోని హైడ్రా కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో భాగంగా 57 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తైతే చాలా సమస్యలకు పరిష్కారం దొరకుతుందని, ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News April 8, 2025
సత్తెనపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య

బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సత్తెనపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ సురేశ్ కుమార్ కుమార్తె సాహితీ సంధ్య (18) శ్రీకాకుళం జిల్లాలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది. సెలవులకి ఇంటికి వచ్చింది. కళాశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో సంధ్య చిన్నమ్మ ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 8, 2025
చావును రాజకీయం చేయడానికే జగన్ పర్యటన: పరిటాల

ఒక చావును రాజకీయం చేయడానికే మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ఆ గ్రామంలో ఏం జరిగిందో జగన్కు తెలియదని, ప్రకాశ్ రెడ్డి చెప్పిన మాటలు విని వస్తున్నారని అన్నారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని హితవుపలికారు. ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని, టీడీపీ నేతలు సంయమనం కోల్పోవద్దని సూచించారు.