News November 22, 2025
నిర్మల్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

నిర్మల్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపనున్నట్లు డిపో అధికారులు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో తిరుపతి, కాణిపాకం దేవస్థానాలు కూడా దర్శించుకోవచ్చు. ఒక్కొక్కరికి చార్జి రూ.6,300 గా నిర్ణయించారు. ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. వివరాల కోసం 9959226003, 8328021517, 7382842582 నంబర్లలో సంప్రదించండి.
Similar News
News November 23, 2025
అతిగా స్క్రీన్ చూస్తే ఆలస్యంగా మాటలు!

పిల్లలను అతిగా స్క్రీన్(TV, ఫోన్) చూసేందుకు అలవాటు చేస్తే వారి భవిష్యత్తుకు ప్రమాదమని అంతర్జాతీయ సర్వే హెచ్చరిస్తోంది. చిన్నవయసులో(1-5 ఏళ్లు) ఎక్కువగా స్క్రీన్ చూసే పిల్లలకు మాటలు రావడం ఆలస్యమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అటు కొత్త పదాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుందని పేర్కొంది. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని, తప్పనిసరైతే నాలెడ్జ్ పెంచే వీడియోలను సూచించాలని చెబుతోంది.
News November 23, 2025
వనపర్తి: శిక్షకులు లేక విద్యార్థుల ఇబ్బందులు

వనపర్తి జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొన్ని కళాశాలలో క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నా.. శిక్షకులు లేకపోవడంతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో శిక్షకులు అందుబాటులో లేరు. దీంతో చాలామంది విద్యార్థులు ఆసక్తి ఉన్నా క్రీడలకు దూరమవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శిక్షకులను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.
News November 23, 2025
మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

తెలంగాణ మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.


