News August 25, 2025
నిర్మల్ నుండి మహారాష్ట్రకు బస్సు సర్వీసులు ప్రారంభం

నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి మహారాష్ట్రలోని అప్పారావుపేట, మలక్జాం గ్రామాలకు కొత్త బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులు రోజుకు మూడుసార్లు అందుబాటులో ఉంటాయని నిర్మల్ డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఉదయం 9:50, మధ్యాహ్నం 2:00, సాయంత్రం 5:10 గంటలకు ఈ బస్సులు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త సర్వీసులను వినియోగించుకుని ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News August 27, 2025
సంగారెడ్డి: ‘టొబాకో ఫ్రీ స్కూల్ ఛాలెంజ్’ పోటీలు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలల్లో ‘టొబాకో ఫ్రీ స్కూల్ ఛాలెంజ్’ పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పొగాకు రహిత సమాజాన్ని ప్రోత్సహించడమే ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. పాఠశాలల్లో ర్యాలీలు, స్లోగన్స్, పెయింటింగ్ వంటి అంశాలపై పోటీలు నిర్వహించాలని, వాటికి సంబంధించిన నాణ్యమైన ఫొటోలు, వీడియోలను MyGov.inలో అప్లోడ్ చేయాలని సూచించారు.
News August 27, 2025
యాదాద్రి: పండుగ పూట విషాదం.. వ్యక్తి మృతి

పండుగ పూట యాదాద్రి జిల్లాలో విషాదాన్ని నింపింది. భూదాన్ పోచంపల్లిలో వినాయక చవితి మండపానికి కవర్ కడుతూ ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సతీశ్(38) మండప పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా తడిగా ఉన్న మండపం పైనుంచి జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే అతడిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News August 27, 2025
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు- కలెక్టర్

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని చేపట్టే ప్రతి పనిలో విజయం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారుచేసిన గణపతి విగ్రహాలకు పూజలు జరపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.