News March 27, 2025
నిర్మల్: నేటి నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్

కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో గురువారం నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు DMHO డా.రాజేందర్ తెలిపారు. గతంలోనే అన్ని ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా హాజరును పర్యవేక్షించాల్సి ఉండగా సాంకేతిక ఇబ్బందుల వల్ల నిలిపివేశామని, కాగా నేటి నుంచి మళ్లీ బయోమెట్రిక్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
Similar News
News October 29, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్ విద్యార్థి

నవంబర్లో గుంటూరులో జరగబోయే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్.షాకీర్ ఎంపికైనట్టు పాఠశాల హెడ్మాస్టర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సుదర్శన్ రావు, శేఖర్ మీడియాతో మాట్లాడారు. కర్నూలులో జరిగిన ఎంపిక పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి ఉద్యమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు తెలిపారు.
News October 29, 2025
వరంగల్: పక్షుల కోసం గూళ్లు..!

వరంగల్(D) పర్వతగిరి(M) కల్లెడలోని ఓ పాఠశాలలో పక్షులకు ఆహారం, నీరు అందించడానికి గాను ప్రత్యేకంగా గూళ్లను ఏర్పాటు చేశారు. రేకు డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్లు, వెదురు బుట్టలను పక్షుల గూళ్ల మాదిరిగా తయారుచేసి పాఠశాల ఆవరణలోని చెట్లకు వేలాడదీశారు. అందులో గింజలతో పాటు నీళ్లను పెట్టడంతో పక్షులు అక్కడికి వచ్చి తమ ఆకలిని, దాహర్తిని తీర్చుకుంటున్నాయి. దీంతో నిర్వాహకులను పలువురు అభినందిస్తున్నారు.
News October 29, 2025
రెడ్ అలర్ట్లో ఆ జిల్లాలు: మంత్రి లోకేశ్

AP: తుఫాను వల్ల రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. అవి రెడ్ అలర్ట్లో ఉన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనేదే మా లక్ష్యం’ అని ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఈ రాత్రికి ఆయన RTGS కేంద్రంలోనే బస చేయనున్నారు.


