News October 10, 2025
నిర్మల్: పత్తి కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలి

పత్తి పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్లో పత్తి పంట కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి పంట కొనుగోలు ప్రక్రియను నిర్ణిత సమయానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు.
Similar News
News October 11, 2025
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

రెవెన్యూకు సంబంధించిన పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి, సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులను జాగ్రత్తగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
News October 11, 2025
వారిపై నిఘా ఉంచండి: గుంటూరు రేంజ్ IG

రానున్న దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు దీపావళి భద్రతపై అవగాహన కల్పించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులతో ఐజీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ఆర్థికనేరాలలో టాప్ 10 ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. రాత్రీ పగలు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.
News October 11, 2025
చైనాకు ట్రంప్ మరోసారి హెచ్చరికలు

అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో చైనాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి ప్రతిచర్యగా చైనా ఉత్పత్తులపై మరోసారి భారీగా సుంకాలు తప్పవని హెచ్చరించారు. చైనాతో స్నేహంగా ఉంటున్నా తాజా చర్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ తరుణంలో జిన్పింగ్తో భేటీకి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మరో 2 వారాల్లో సౌత్ కొరియా పర్యటన సందర్భంగా జిన్ పింగ్తో ట్రంప్ భేటీ కావాల్సి ఉంది.