News February 26, 2025

నిర్మల్: పది ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

image

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దారని డీఈవో రామారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Similar News

News November 5, 2025

పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలి: VZM SP

image

పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ దామోదర్ కోరారు. విజయనగరం ఎస్పీ కార్యాలయం నుంచి బుధవారం రీసెప్షనిస్టలుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ సమస్యలపై స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్నారు. ఫిర్యాదు రాయడం రానివారికి సిబ్బందే సాయం చేయాలని ఆదేశించారు.

News November 5, 2025

సింగరేణి పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్

image

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 4.0లో భాగంగా సింగరేణి సీఎంపీఎఫ్/సీపీఆర్‌ఎంఎస్ పెన్షనర్ల కోసం ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నట్లు జీఎం జి.వి. కిరణ్ కుమార్ తెలిపారు. నేడు ఉదయం 10:30 గంటలకు సింగరేణి హెచ్‌ఆర్‌డీ కాన్ఫరెన్స్ హాల్లో క్యాంప్ జరుగుతుందని తెలిపారు. పెన్షనర్లు ఆధార్, పాస్‌బుక్‌తో హాజరు కావాలన్నారు.

News November 5, 2025

ఉమ్మనీరు ఎక్కువైతే ఏం చేయాలంటే?

image

తల్లికి షుగర్ నియంత్రణలో లేకపోతే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. అలాగే అల్ట్రా సౌండ్‌ గైడెడ్‌ ఆమ్నియోసెంటెసిస్‌ ద్వారా కూడా ఉమ్మనీరును కొంతవరకు నియంత్రణలో ఉంచవచ్చు. తల్లికి డెలివరీ కాంప్లికేషన్లు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు అధిక ఉమ్మనీరు కాన్పు సమయంలో బిడ్డకు ప్రాణాంతకమై నియోనేటల్ సేవలు అవసరమవుతాయి. కాబట్టి అన్ని వసతులు ఉన్న ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంటే మంచిది.