News March 20, 2025
నిర్మల్: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

నిర్మల్ జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 163 బీఎన్ఎస్ సెక్షన్ను అమలు చేస్తున్నామన్నారు.
Similar News
News September 18, 2025
HNK: కొడుకును సమర్థించారు.. కటకటాల పాలయ్యారు!

హనుమకొండ జిల్లా వేలేరు మండలానికి చెందిన తరుణ్, రాజులు ఓ గ్రామానికి చెందిన బాలికకు సైగలు చేస్తూ వేధించేవారు. నిందితుల తల్లిదండ్రులకు చెప్పగా వారి కొడుకులను సమర్థించారు. దీంతో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో సమ్మయ్య, ఇందిరమ్మలతో కలిపి నలుగురిపై పోక్సో కేసు నమోదైంది. మూడేళ్ల జైలు, రూ.12వేల జరిమానా వేస్తూ HNK జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి అపర్ణ దేవి తీర్పు ఇచ్చారు.
News September 18, 2025
బాల్మర్ లారీలో ఉద్యోగాలు

<
News September 18, 2025
జగన్ అసెంబ్లీకి వస్తారా?

AP: నేటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ చీఫ్ జగన్ హాజరవుతారా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన కోరుతుండగా కూటమి ప్రభుత్వం మాత్రం అర్హత లేదని చెబుతోంది. అటు అసెంబ్లీకి వెళ్లొద్దని YCP ఎమ్మెల్యేలను జగన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఎప్పటిలాగే పార్టీ నుంచి మండలి సభ్యులే హాజరవుతారని తెలుస్తోంది. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.