News February 27, 2026
నిర్మల్: పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఎస్పీ రివ్యూ సమావేశం

జిల్లా పోలీసు కార్యాలయంలో SP జానకి షర్మిల అధ్యక్షతన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కలిసి డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రేవ్ కేసుల్లో కోర్టులలో వచ్చిన అక్విటల్ తీర్పులపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. కేసులు అక్విటల్ కావడానికి గల కారణాలు, దర్యాప్తు లోపాలు, సాక్ష్యాధారాల సమర్పణలో ఉన్న సమస్యలు, సాక్షుల హాజరు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం వారిని సన్మానించారు.
Similar News
News February 27, 2026
ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలుపు

T20WC: కొలంబోలో NZతో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో సాధించాల్సిన రన్రేట్ 14+కు చేరింది. ఈ క్రమంలో విల్ జాక్స్(32*) NZ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సులు, బౌండరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. అహ్మద్(19*) సైతం మెరుపులు మెరిపించారు. 18వ ఓవర్లో 22, 19వ ఓవర్లో 16 రన్స్ రావడం ఇంగ్లండ్కు కలిసొచ్చింది.
News February 27, 2026
రేపటితో ముగియనున్న గుంటూరు మెడికల్ కాలేజీ మెడికల్ ఎగ్జిబిషన్

గుంటూరులో ముప్పై ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న గుంటూరు మెడికల్ కాలేజీ మెడికల్ ఎగ్జిబిషన్ రేపటితో ముగియనుంది. ఫిబ్రవరి 4న ప్రారంభమైన ఈ ప్రదర్శనకు ఇప్పటివరకు సుమారు 80 వేల మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సందర్శించి అభినందించారు. చివరి రోజున ప్రజలు తప్పక వీక్షించాలని ప్రిన్సిపల్ డా. సుందరాచారి కోరారు. మరుపురాని వైద్య విజ్ఞాన అనుభూతిని పొందినట్లు పలువురు సందర్శకులు పేర్కొన్నారు.
News February 27, 2026
కామారెడ్డి జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 34.9°Cలు నమోదు కాగా, నిన్న ఉష్ణోగ్రత 36.2°C, రేపటి ఉష్ణోగ్రత 35°C, ఎల్లుండి 35.1°C ల ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉక్కపోత ఉండగా, ఉదయం వాతావరణం చల్లబడుతుంది. కామారెడ్డి జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేయగా ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


