News October 14, 2025
నిర్మల్ : పోలీస్ సేవలు ప్రజలకు చేరువ చేస్తాం: ఎస్పీ

నిర్మల్ జిల్లాలో పోలీస్ సేవలను మరింత చేరువ చేసి, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ఉండి, వినతులను స్వీకరించాలని ఆమె సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
Similar News
News October 14, 2025
పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. OCT 28 లాస్ట్ డేట్

TG పారామెడికల్ బోర్డు 2025- 26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేసిందని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RGM) ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ తెలిపారు. DMLT, డయాలసిస్ కోర్సుల్లో చెరో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. బైపీసీ విద్యార్థులు OCT 28 సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://tgpmb.telangana.gov.in వైబ్సైట్ చూడొచ్చు.
News October 14, 2025
తిరుపతి: అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో శిక్షణ

APSSDC ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC) తిరుపతిలో అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడీ సతీశ్ చంద్ర వెల్లడించారు. పదో తరగతి పాసై, 15 నుంచి 45 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఎస్వీ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న NAC కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 20.
News October 14, 2025
ఎల్లో అలర్ట్: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో కాసేపట్లో HYD, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.