News February 23, 2026
నిర్మల్: ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రక్త కళ్యాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
విజయ్ సేతుపతి, సాయి పల్లవి క్రేజీ కాంబో!

మణిరత్నం దర్శకత్వంలో ఒక ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకోనుంది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. ఈ కథను ముందుగా ధనుష్కు వినిపించగా వివిధ కారణాలతో ఆయన తప్పుకున్నారట. తర్వాత శింబు, ధ్రువ్ విక్రమ్ పేర్లు వినిపించాయి. ఫైనల్గా విజయ్ సేతుపతి ఫిక్సయ్యారు. AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు టాక్.
News February 24, 2026
‘సాగునీటి’ ఎన్నికల్లోనూ ‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత

AP: స్థానిక ఎన్నికల తరహాలోనే సాగునీటి సంఘాల ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ చేసేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ‘1980-90లో జనాభా పెరిగిన కారణంగా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి పడిపోయింది. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తున్నాం’ అని మంత్రి రామానాయుడు తెలిపారు.
News February 24, 2026
కల్తీ నెయ్యిపై నేడు అసెంబ్లీలో చర్చ

AP: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో చర్చించనుంది. ఉ.10.30 నుంచి మ.2 గంటల వరకు టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన 10 మంది సభ్యులు ఈ అంశంపై మాట్లాడనున్నారు. గొంతునొప్పి కారణంగా నిన్న సభకు హాజరుకాని డిప్యూటీ సీఎం పవన్ కూడా నేడు సభలో ప్రసంగించే అవకాశం ఉంది. మ.12.30 నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడి చివరలో ఓ ప్రకటన విడుదల చేస్తారు.


