News January 27, 2025
నిర్మల్: ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్

నిర్మల్ మున్సిపల్ ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సోమవారం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సహకరించాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, నిర్మల్ మున్సిపాలిటీను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమయానికి అన్ని రకాల పన్నుల వసూలు చేయాలన్నారు.
Similar News
News December 30, 2025
సారలమ్మను దర్శించుకున్న ఎస్పీ

తాడ్వాయి మండలం కన్నేపల్లిలో సారలమ్మను ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, చీరే సారే, బెల్లం (బంగారం) కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో సారలమ్మ పూజారులు కాక సారయ్య, కాక కిరణ్, కాక నవీన్, కాక రంజిత్ ఉన్నారు.
News December 30, 2025
ఇలా చేస్తే ఫోన్ పేలుతుంది!

బ్యాటరీ లోపాలు, అతిగా వేడెక్కడం వల్ల <<18712712>>ఫోన్లు<<>> పేలుతాయని నిపుణులు చెబుతున్నారు. నాసిరకం ఛార్జర్లు వాడటం, మొబైల్ ఛార్జింగ్లో ఉండగా గేమింగ్ లేదా వీడియో కాల్స్ చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లయితే వెంటనే అప్రమత్తమవ్వాలంటున్నారు. ఎప్పుడూ కంపెనీ ఒరిజినల్ ఛార్జర్లనే వాడాలని, ఫోన్ హీటెక్కినప్పుడు కాసేపు పక్కన పెడితే బ్యాటరీ సురక్షితంగా ఉంటుందని సూచిస్తున్నారు. SHARE IT
News December 30, 2025
భద్రాద్రి: మేడారం జాతరకు 203 ప్రత్యేక బస్సులు

మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ.. 203 బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అత్యధికంగా కొత్తగూడెం డిపో నుంచి 110 బస్సులు నడపనున్నారు. అలాగే ఇల్లందు నుంచి 41, భద్రాచలం 21, మణుగూరు 16, పాల్వంచ నుంచి 15 బస్సులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. జాతర రద్దీని బట్టి మరిన్ని సర్వీసులు పెంచే అవకాశం ఉందని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.


