News November 19, 2025
నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 5, 2026
అనంత జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..!

సీఎం చంద్రబాబు ఈనెల 6న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ను కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. ఉదయం 11:10 గంటలకు యాడికి(M) వేములపాడుకు చేరుకుంటారు. 11:30 నుంచి ఒంటి గంట వరకు ‘ప్రజావేదిక’లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:40-02:30 మధ్య పెండేకల్లు రిజర్వాయర్ను పరిశీలిస్తారు. 2:40-4:10 వరకు వేములపాడులో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. 4:20 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.
News April 5, 2026
ఒకే కథ.. 3 ప్రాజెక్టులు!

‘కుమారస్వామి’ కథతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా తెరకెక్కించాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ కథాంశంతోనే మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఆయన కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. కాగా ‘కుమారస్వామి’పై తానూ ఓ స్క్రిప్ట్ రాసుకున్నట్లు కిశోర్ తిరుమల కూడా గతంలో వెల్లడించారు. మరి వీటిలో ఏది ముందుగా థియేటర్లలోకి వస్తుందో చూడాలి.
News April 5, 2026
హాజరుకాని వారికి నోటీసులు: ZP ఛైర్మన్

చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జడ్పీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరవడంతో నోటీసులు పంపించాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేరుశెనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలన్నారు. మామిడి రైతులకు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


