News October 14, 2025
నిర్మల్: మళ్లీ ఆయనకే ‘హస్తం’ పగ్గాలు..?

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి పదవికి సంబంధించి పీసీసీ పరిశీలకుల పర్యటన జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఈ పదవిని మళ్లీ కూచాడి శ్రీహరి రావుకి కేటాయిస్తారని అంతటా చర్చ నడుస్తోంది. పార్టీ అధికారంలోకి రాక ముందు నుంచి చురుకుగా కార్యక్రమాలు నిర్వహించారని ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారని మద్దతుదారులు పేర్కొంటున్నారు. అయితే ఈ పదవికి ఆనంద్ రావు పటేల్, ఎంబడి రాజేశ్వర్ తదితరులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 14, 2025
KNR: రోడ్డు ప్రమాదం.. పోతిరెడ్డిపేటవాసి మృతి

హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సమ్మయ్య గౌడ్(45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామ సబ్ స్టేషన్ సమీపంలో రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సమ్మయ్య గౌడ్ అక్కడికక్కడే మరణించగా.. మరొకరు గాయపడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దుర్ఘటన పోతిరెడ్డిపేటలో విషాదాన్ని నింపింది.
News October 14, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మహిళల ఓట్లే కీలకం..!

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పురుషుల ఓట్లు వివిధ పార్టీలకు డివైడ్ అయ్యే అవకాశం ఉన్నా మహిళల ఓట్లు మాత్రం ఒకే పార్టీకి గంప గుత్తగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 3,98,982ఓటర్లు ఉండగా అందులో 1,91,590మంది మహిళా ఓటర్లే ఉన్నారు. కాగా ఫ్రీబస్సు స్కీమ్తో మహిళలు తమకే ఓట్లు వేస్తారని కాంగ్రెస్ నేతలు అంటుండగా గతంలో బతుకమ్మ చీరలిచ్చిన KCRవైపే మహిళలు ఉన్నారని BRSనేతలు చెబుతున్నారు.
News October 14, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మహిళల ఓట్లే కీలకం..!

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పురుషుల ఓట్లు వివిధ పార్టీలకు డివైడ్ అయ్యే అవకాశం ఉన్నా మహిళల ఓట్లు మాత్రం ఒకే పార్టీకి గంప గుత్తగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 3,98,982ఓటర్లు ఉండగా అందులో 1,91,590మంది మహిళా ఓటర్లే ఉన్నారు. కాగా ఫ్రీబస్సు స్కీమ్తో మహిళలు తమకే ఓట్లు వేస్తారని కాంగ్రెస్ నేతలు అంటుండగా గతంలో బతుకమ్మ చీరలిచ్చిన KCRవైపే మహిళలు ఉన్నారని BRSనేతలు చెబుతున్నారు.