News February 27, 2026
నిర్మల్: మహిళా చేతికి బస్ స్టీరింగ్

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ‘ఇందిరా శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు బస్సులను పంపిణీ చేయనుంది. వీటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు రూ.69,468 ఆదాయం లభించనుంది. రూ.36 లక్షల బస్సు విలువలో సేర్ఫ్ ద్వారా రూ.30 లక్షలు, బ్యాంకు ద్వారా రూ.6 లక్షలు రుణం అందించనున్నారు. ఈ పథకం ద్వారా మహిళా సంఘాల ఆదాయం పెరిగి, వారు స్వయం సమృద్ధి సాధించనున్నారు.
Similar News
News February 27, 2026
చేపలపై చెరువుల్లో నీటి నాణ్యత ప్రభావం

చెరువుల్లో నీరు ఎంత నాణ్యంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. నీటి నాణ్యత చెడిపోతే చేపల్లో ఒత్తిడి, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. చేపలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం లీటరు నీటికి 5 మి.గ్రా. DO(డిసాల్వ్ ఆక్సిజన్) ఉండాలి. ఇది 3 మి.గ్రా. కంటే తక్కువైతే చేపలు బలహీనపడతాయి, 1 మి.గ్రా. కన్నా తక్కువైతే చేపలు చనిపోవచ్చు. తెల్లవారుజామున, మబ్బు వాతావరణం, వర్షపు రోజుల్లో డిఓ తక్కువగా ఉంటుంది.
News February 27, 2026
NCERT బుక్లో ఏముంది?

‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశంలో సుప్రీంకోర్టులో 81వేలు, హైకోర్టుల్లో 62 లక్షలు, జిల్లా, కింది కోర్టుల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని <<19224324>>NCERT<<>> పేర్కొంది. జడ్జిల కొరత, మౌలిక సౌకర్యాలు లేమి, సంక్లిష్టమైన న్యాయప్రక్రియలే దీనికి కారణమని తెలిపింది. న్యాయమూర్తులకూ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందని.. 2017-21 మధ్య వారిపై 1,600 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. కాగా దీనిని CJI <<19243239>>బ్యాన్<<>> చేశారు.
News February 27, 2026
ఆదిలాబాద్: ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 491 గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగియగా మొత్తం 9,226 మంది విద్యార్థులకు 8,735 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 8,204 మందికి 366 మంది విద్యార్థులు, వొకేషనల్ విభాగంలో 1,022 విద్యార్థులకు 125 మంది విద్యార్థులు, మొత్తం 491 మంది ఎగ్జామ్కు గైర్హాజరైనట్లు DIEO జాదవ్ గణేశ్ కుమార్ వెల్లడించారు.


