News February 25, 2026
నిర్మల్: మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గంజాయి, నాటు సారా, ఇతర నిషేధిత పదార్థాలను గుర్తించి, కేసులు నమోదు చేయాలన్నారు. మత్తు పదార్థాలు వాడటం వల్ల జీవితాలు నాశనం అవుతాయని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Similar News
News February 26, 2026
IND vs ZMB: టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లేనా?

T20 WC S-8లో నేడు భారత్, జింబాబ్వే చెన్నై వేదికగా తలపడనున్నాయి. తొలి మ్యాచుల్లో ఓడిన ఇరుజట్లకూ ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన టైమ్. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని ‘డ్యూ ఫ్యాక్టర్’ శాసించేలా ఉంది. రాత్రి వేళ మంచు కురిస్తే బౌలర్లకు గ్రిప్ కష్టమై బ్యాటర్లు భారీ స్కోర్లు చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన టీమ్ చేజింగ్ వైపే మొగ్గు చూపొచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా సెమీస్ ఆశలు నిలవాలంటే భారత్ గెలవాల్సిందే.
News February 26, 2026
పెద్దన్నను కాదని భారత్కు ఇజ్రాయెల్ సాయం

దౌత్య సంబంధాలు లేని 1971లోనే అమెరికాను ఎదిరించి మరీ భారత్కు ఇజ్రాయెల్ రహస్యంగా ఆయుధాలు, శిక్షణ అందించింది. 1980లలో పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకూ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’కూ ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతామని నెతన్యాహు గతంలో ప్రకటించారు. రక్షణ, వ్యవసాయం, AI రంగాల్లో ఇరు దేశాల సహకారం ఇప్పుడు మరింత బలోపేతమైంది.
News February 26, 2026
IND Vs ZMB: గెలిస్తేనే సెమీస్ రేసులో ఇండియా

T20 WC S-8లో భాగంగా నేడు 2 కీలక మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు అహ్మదాబాద్లో సౌతాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు చెన్నైలో భారత్, జింబాబ్వే ఢీకొంటాయి. తొలి మ్యాచ్లో SA చేతిలో ఓడిన ఇండియా సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్లో మంచి నెట్ రన్ రేట్తో గెలవడం తప్పనిసరి. లేదంటే రేసు నుంచి దాదాపు తప్పుకొన్నట్లే. అటు వెస్టిండీస్, SA ఇప్పటికే చెరో విజయంతో పాయింట్ల పట్టికలో ముందున్నాయి.


