News March 28, 2025
నిర్మల్: మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది: ఎస్పీ

మీరు బాగుంటేనే సమాజం భద్రంగా ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజల శాంతి భద్రతలు కాపాడటంలో ఎండనకా వాననక నిరంతరం విధులు నిర్వహించే సిబ్బంది బాగుండాలని తెలిపారు. 30 ఏళ్ల వయసు పైబడిన 703 మంది పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 31, 2025
రేపు టెన్త్ ఎగ్జామ్ ఉందా?.. క్లారిటీ

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆప్షనల్ <<15946388>>హాలిడే<<>> ఇవ్వడంతో రేపు జరగాల్సిన సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెలకొంది. దీనిపై క్లారిటీ కోసం Way2News విద్యాశాఖ అధికారులను సంప్రదించింది. ఆప్షనల్ హాలిడే ఇచ్చినంత మాత్రాన పరీక్షలో ఎలాంటి మార్పు ఉండదని, రేపు యథావిధిగా ఎగ్జామ్ ఉంటుందని వారు స్పష్టం చేశారు.
News March 31, 2025
యాలాల్: బాలుడి కిడ్నాప్కు యత్నం..

యాలాల్ మండలం యోన్కెపల్లిలో 8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్చేసేందుకు ఓ దుండగుడు యత్నించాడు. గమనించిన స్థానికులు దుండగుడిని నిలదీశారు. అనంతంరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దుండగుడు కొడంగల్ మండలం పర్సాపూర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 31, 2025
ADB: గ్రూప్-1లో అమరేందర్కు 149 ర్యాంకు

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ప్రతిభ కనబరిచారు. స్థానిక దోబీ కాలనీకి చెందిన బండి అశోక్- లక్ష్మి దంపతుల కుమారుడు బండి అమరేందర్ 478.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 149 ర్యాంకు సాధించారు. మల్టీ జోన్- 1లో 76వ ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.