News January 7, 2026

నిర్మల్: మున్సిపాలిటీలపై బీజేపీ గురి!

image

వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న సంకేతాలు వెలువుడుతుండడంతో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. కాంగ్రెస్, BRS, ఎంఐఎం పార్టీల కంటే BJP ఓ అడుగు ముందుకు వేసి కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్ పదవులను దక్కించుకొని ఛైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ ఎన్నికల్లో అదే ఊపు కొనసాగింది.

Similar News

News February 7, 2026

KMR: ప్రచారానికి మిగిలింది మూడు రోజులే!

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి 3 రోజుల్లో తెరపడనుంది. సోమవారం సాయంత్రం 5గం.లోపు బరిలోని అభ్యర్థులు ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో అనుకున్న స్థాయిలో ప్రచారం జరగలేదనేది ఆయా వార్డుల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. సైలెంట్ ఓటింగ్‌పైనే అభ్యర్థులు ఆధారపడ్డట్లు కనిపిస్తుంది. సిట్టింగ్లు బెట్టుగా గెలవాలనే ఉత్సాహంలో ఉన్నారు.

News February 7, 2026

అర్ధరాత్రి బిహార్ ఎంపీ అరెస్ట్

image

నాటకీయ పరిణామాల నడుమ బిహార్ ఎంపీ పప్పూ యాదవ్(రాజేశ్ రంజన్) అరెస్టయ్యారు. 1995 డాక్యుమెంట్ ఫోర్జరీ కేసులో ఆయనను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన పోలీసులతో అరెస్టుకు వారెంట్ లేదని వాగ్వాదానికి దిగారు. ఇవాళ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఢిల్లీ నుంచి పాట్నాలోని ఇంటికి చేరిన గంటలోపే పప్పూను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణియా లోక్‌సభ నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News February 7, 2026

పాడేరు: SC,ST పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహకాలు

image

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన IDP పాలసీ 2024-29 ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించిందని జిల్లా పరిశ్రమల అధికారులు శుక్రవారం తెలిపారు. తయారీ, సర్వీసు రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి 45 శాతం రాయితీ లభిస్తుందన్నారు. హోటల్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యుత్ ఛార్జీలపై కూడా రాయితీ ఉంటుందన్నారు.