News February 13, 2025
నిర్మల్: యువతి దారుణ హత్య.. నిందితుడికి జీవత ఖైదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739409845484_1043-normal-WIFI.webp)
ఏడాది క్రితం ప్రేమ పేరుతో <<12630813>>యువతిని హత్య<<>> చేసిన వ్యక్తికి నిర్మల్ జిల్లా కోర్టు జీవితకాల శిక్ష, విధించింది. పోలీసులు వివరాలు.. ఖానాపూర్ అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ అదే కాలనీకి చెందిన అలేఖ్యను ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె నిరాకరించడంతో ద్వేషం పెంచుకున్నాడు. ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో విషయం తెలుసుకున్న శ్రీకాంత్ 2024 ఫిబ్రవరి 8న ఆమెను కత్తితో నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు.
Similar News
News February 13, 2025
ADB: వ్యక్తిపై లైంగిక దాడి కేసు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739372652055_50249255-normal-WIFI.webp)
తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ADB 1 టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ వివాహిత(24), శాంతినగర్కి చెందిన షేక్ ఆసిఫ్ 8నెలల పాటు సహజీవనం చేశారు. కాగా తనను ఆసిఫ్ మోసం చేశాడని, లైంగికంగా వేధించి తన వీడియోలు తీశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆసిఫ్ తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది.
News February 13, 2025
ADB: ‘గదిలో బంధించి రేప్ చేసి.. వీడియోలు తీశాడు’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739372652055_50249255-normal-WIFI.webp)
శాంతినగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఆసిఫ్పై 1 TOWN PSలో అట్రాసిటీ, రేప్ కేసు నమోదైంది. CI సునీల్ వివరాల ప్రకారం.. ఆసిఫ్ ప్రేమపేరుతో వెంబడిస్తూ ఓ యువతిని బెదిరించగా ఆమె నిరాకరించింది. ఆమెను బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లి గదిలో బంధించాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకొని వీడియోలు తీశాడు. పెళ్లి చేసుకోకుంటే వీడియోలు లీక్ చేస్తానని కులంపేరుతో దూషించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.
News February 13, 2025
ADB: కరెంట్ షాక్తో బాలిక మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368286671_51600738-normal-WIFI.webp)
కరెంట్ షాక్తో ADBకు చెందిన బాలిక మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. అంబేడ్కర్నగర్కు చెందిన 9వ తరగతి చదువుతున్న తహ్రీం గత నెల 18న తన ఇంటి డాబా పైకి వెళ్లింది. ఈ క్రమంలో డాబాపై నుంచి వెళుతున్న హైఓల్టేజీ విద్యుత్ తీగలతో కరెంట్ సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబీకులు రిమ్స్కు, అక్కడి నుంచి మహారాష్ట్రలోని వార్ధాకు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం బాలిక మృతి చెందింది.