News October 19, 2025

నిర్మల్: రాష్ట్రంలో మళ్లీ ‘మొదటి’కొచ్చేలా..!

image

2022-23లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన పదో తరగతి ఫలితాలు, 2024-25లో 15వ స్థానానికి పడిపోయిన నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయి, మార్కుల పెరుగుదల వంటి అంశాలను రికార్డు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 117 ప్రభుత్వ బడుల్లో 4155మంది చదువుకుంటున్నారు.

Similar News

News October 21, 2025

కొయ్యలగూడెం అమ్మాయికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌

image

“ముదితల్ నేర్వగరాని రాని విద్య కలదే ముద్దారగ నేర్పింపగన్” అన్న ఆర్యోక్తి దాసరోజు అలేఖ్యకి వర్తిస్తుంది. కోచ్, తండ్రి శ్రీధర్ పర్యవేక్షణలో తొమ్మిదవ తరగతి విద్యనభ్యసించే కొయ్యలగూడెం విద్యార్థి అలేఖ్య కరాటే విభాగంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పలు పతకాలు సొంతం చేసుకుంది. చెన్నైలో గత నెల 18న నిర్వహించిన సెలక్షన్స్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది.

News October 21, 2025

మిమ్మల్ని చిత్తూరు ప్రజలు మరవలేరు..!

image

2020 నవంబర్ 8న సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఐరాల(M) రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం పొందారు. 2007లో చిత్తూరులో CKబాబుపై జరిగిన హత్యాయత్నంలో గన్‌మెన్స్ హుస్సేన్ బాషా, సురేంద్ర అమరులయ్యారు. 2017లో పలమనేరు అడవుల్లో మహిళను అత్యాచారం చేయబోయారు. నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ జవహర్ నాయక్, హోంగార్డు దేవంద్ర చనిపోయారు.
#నేడు అమరవీరుల దినోత్సవం

News October 21, 2025

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అటు నిన్న 72,026 మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. 23,304 మంది తలనీలాలు సమర్పించారన్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.86 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.